ఎలక్ట్రిక్ వాహనరంగాన్ని ఏపీ ప్రోత్సహిస్తుంది: మంత్రి అమర్ నాథ్

ABN , First Publish Date - 2022-08-06T02:31:00+05:30 IST

Amaravathi: ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudiwada Amarnath Reddy) పేర్కొన్నారు. ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేస్తుందని ఆయన

ఎలక్ట్రిక్ వాహనరంగాన్ని ఏపీ ప్రోత్సహిస్తుంది:  మంత్రి అమర్ నాథ్

Amaravathi: ఏపీలో పెట్టుబడులకు పలు కంపెనీల ఆసక్తి కనబరుస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudiwada Amarnath Reddy) పేర్కొన్నారు. ప్రజలకు హాని చేయని పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం వర్చువల్ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి భవిష్యత్ ఉందని, ఏపీలో ఈవీ వ్యవస్థ ఏర్పాటుకు కావలసిన మౌలిక వసతులను సమకూరుస్తామని చెప్పారు. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ.. డీజిల్‌తో నడుస్తున్న ప్రజా రవాణా వ్యవస్థను 50శాతం విద్యుత్ వాహనాలుగా మలిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ (RTC)లో నడుస్తున్న 7000 బస్సులలో 1000 బస్సులను విద్యుత్ వాహనాలుగా మారుస్తున్నామని, ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) తిప్పుతున్నామని చెప్పారు. 

Updated Date - 2022-08-06T02:31:00+05:30 IST