AP News: జగన్ రెచ్చగొట్టే వ్యాఖలు చేయడం దుర్మార్గం : టీడీపీ
ABN , First Publish Date - 2022-09-16T01:37:38+05:30 IST
Amaravathi: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజధాని రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం ప్రసంగించటం దుర్మార్గమని పేర్కొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు,
Amaravathi: సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై టీడీపీ (TDP) ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాజధాని రైతులపై ఉత్తరాంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టేలా సీఎం ప్రసంగించటం దుర్మార్గమని పేర్కొన్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Sambasiva Rao) మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే సీఎం పనిగా పెట్టుకున్నారు. కుట్రతో అమరావతిని మూడు ముక్కలు చేసి పాలనా వికేంద్రీకరణ అంటే తెలుగుజాతి క్షమించదు. విశాఖలో గత మూడున్నరేళ్లలో 70వేల ఎకరాల భూమి చేతులు మారింది. ఉత్తరాంధ్రపై అంత అభిమానం ఉంటే ఎందుకు విశాఖను అభివృద్ధి చేయలేదు? టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్థల్ని ఎందుకు వెల్లగొట్టారు? ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే తపనే సీఎం మాటల్లో వ్యక్తమైంది. తన అసమర్థత, చేతకాని తనం కప్పిపుచ్చుకునేందుకు సీఎం ఇవాళ మళ్లీ అమరావతిపై ద్వేషం వెళ్లగక్కారు.’ అని పేర్కొన్నారు.