మహానీయుల ఆలోచనా విధానాలను ఆచరించాలి
ABN , First Publish Date - 2022-08-14T06:00:36+05:30 IST
పిఠాపురం, ఆగస్టు 13: మహానీయుల ఆలోచనా విధానాలను అందరు ఆచరించాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి తానేటి వనిత సూచించారు. పిఠాపురం ఇందిరాగనర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వం
హోంమంత్రి తానేటి వనిత
పిఠాపురం, ఆగస్టు 13: మహానీయుల ఆలోచనా విధానాలను అందరు ఆచరించాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి తానేటి వనిత సూచించారు. పిఠాపురం ఇందిరాగనర్లో నూతనంగా ఏర్పాటు చేసిన భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాన్ని శనివారం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. వనిత మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటుతో తమ పనిఅయిందని భావించకుండా వారిని ఎప్పటికప్పుడు సంస్మరించుకోవాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీతో పాటు జగ్జీవన్రామ్ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. జగ్జీవన్రామ్ ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కొమ్మూరి కనకారావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటికి మాదిగలకు జిల్లాలో సరైన రాజకీయ ప్రాధాన్యం లభించలేదని, నియోజకవర్గం నుంచే మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించడం ప్రారంభంకావాలని ఆకాంక్షించారు. ఇందిరానగర్ వద్ద రూ.65లక్షలతో నిర్మించే బాక్స్ కల్వర్టు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
భవనాల ప్రారంభం
గొల్లప్రోలు రూరల్: దుర్గాడలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను హోం మంత్రి వనిత ప్రారంభించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ వంగా గీతావిశ్వనాథ్, గొల్లప్రోలు జడ్పీటీసీ ఉలవకాయల నాగలోవరాజు, ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ, ఏఎంసీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, మాజీ చైర్మన్ మొగలి బాబ్జి తదితరులున్నారు.
కొండెవరం(కొత్తపల్లి): కొండెవరంలో రూ. 80 లక్షలతో నిర్మించిన 2 సచివాలయ భవనాల ను హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. వనితకు కొత్తపల్లి పీఏసీఎస్ అధ్యక్షులు మారిశెట్టి బుజ్జి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఎంపీ వంగా గీత, జడ్పీటీసీ గుబ్బల తులసీకుమార్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు సాదరంగా స్వాగతం పలికారు. వైసీపీ మ ండలాధ్యక్షుడు ఆనాల సుదర్శన్, వైస్ ఎంపీపీలు మాదిరెడ్డి దొరబాబు, శెట్టిబత్తిన సురే్షకుమార్,ఉప సర్పంచ్ మేడిశెట్టి శ్రీరాములు పాల్గొన్నారు.