సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
ABN , First Publish Date - 2021-09-01T16:19:26+05:30 IST
సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
అమరావతి: సంఘం డెయిరీ విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పిల్ను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజనల్ బెంచ్ను ప్రభుత్వం ఆశ్రయించగా..అక్కడ కూడా సర్కార్కు చుక్కెదురైంది. సంఘం డెయిరీని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.