ఏపీలో 68 డివిజన్లలో మోగిన పంచాయితీ ఎన్నికల నగారా
ABN , First Publish Date - 2021-01-23T17:54:51+05:30 IST
ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు.
విజయవాడ: ఏపీలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం ఉదయం విడుదల చేశారు. 68 డివిజన్లలో నాలుగు విడతలుగా 659 మండలాల్లో పంచాయితీ ఎన్నికల నగారా మోగింది. ఉదయం 6:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత లెక్కింపు, ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఎన్నికల తేదీలు:
* ఫిబ్రవరి 5 తొలి విడతలో 14డివిజన్లలో 146 మండలాల్లో పంచాయితీ ఎన్నికలు
* ఫిబ్రవరి 9న రెండో విడతలో 17 డివిజన్లలో 173 మండలాలు
* ఫిబ్రవరి 13న మూడో విడతలో 18 డివిజన్లలో 169మండలాలు
* ఫిబ్రవరి 17న నాలుగో విడతలో 19 డివిజన్లలో 171మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
మొదటి విడత రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలు:
1. శ్రీకాకుళం
రెవెన్యూ డివిజన్ : శ్రీకాకుళం
మండలాలు : ఎచ్చెర్ల, జి.సిగడం, రణస్ధలం, గార, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి
రెవెన్యూ డివిజన్ : టెక్కలి
మండాలాలు : జలుమూరు
రెవెన్యూ డివిజన్ : పాలకొండ
మండలాలు : సరవకోట
2. విశాఖపట్నం
రెవెన్య డివిజన్ : విశాఖపట్నం
మండలాలు : భీమునిపట్నం, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం, పరవాడ
3. తూర్పు గోదావరి జిల్లా
అమలాపురం డివిజన్లో మండలాలు...అయినవిల్లి, ఆళ్లవారం, అమలాపురం, అంబాజీపేట, ఆత్రేయపురం, ఐ.పోలవరం, కాట్రేనకోన, కొత్తపేట, మలికిపురం, మామిడికుదరు, ముమ్మిడివరం, పి.గన్నవరం, రావులపాలెం, రాజోలు, సఖనేటిపల్లి, ఉప్పలగుప్తం
4. పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు డివిజన్
5. కృష్ణా జిల్లా: నూజివీడు డివిజన్
6. గుంటూరు జిల్లా: గుంటూరు డివిజన్
7. నెల్లూరు జిల్లా: నెల్లూరు డివిజన్
8. కర్నూలు జిల్లా: ఆదోని రెవెన్యూ డివిజన్
9. అనంతపురం జిల్లా: పెనుకొండ రెవెన్యూ డివిజన్
10. వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్కు, కడప డివిజన్లో చక్రాయపేట, యర్రగుంట్ల
11. చిత్తూరు జిల్లా: తిరుపతి రెవెన్యూ డివిజన్లో మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి.