రఘురామకి ఏపీ సీఐడీ మళ్లీ నోటీసులు ఎందుకిచ్చింది?

ABN , First Publish Date - 2022-01-13T01:56:00+05:30 IST

హైదరాబాద్‌లోని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు..

రఘురామకి ఏపీ సీఐడీ మళ్లీ నోటీసులు ఎందుకిచ్చింది?

హైదరాబాద్/అమరావతి: హైదరాబాద్‌లోని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లి రఘురామకు నోటీసులు ఇచ్చారు. గతంలో ఉన్న కేసుల నేపథ్యంలో రఘురామ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.  అయితే ఏ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేశారన్న విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా రఘురామను అరెస్టు చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. గతంలో ఉన్న కేసులకు సంబంధించి రఘురామ విచారణకు హాజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయంపై రఘురామ కృష్ణంరాజుకు సంబంధించిన అడ్వకేట్‌లతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు మాట్లాడారు.


ఈ నేపథ్యంలో ‘‘రఘురామరాజుకి మళ్లీ సీఐడీ నోటీసులు ఎందుకిచ్చింది?. సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా నోటిసులివ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశమేంటి?. రాజీనామా విషయంలో జగన్‌కు సవాల్ విసరడమే కారణమా?. ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను రాఘురామరాజు ఎందుకు టార్గెట్ చేశారు?. ఇంతకూ రఘురామరాజు సంక్రాంతి సంబరాలు కోసం సొంతూరికి వెళ్తున్నారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2022-01-13T01:56:00+05:30 IST