నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ABN , First Publish Date - 2020-11-30T12:43:41+05:30 IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఈ సమావేశాల్లో 20 అంశాలపై సమగ్ర చర్చ జరగాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఉపాధి హమీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణి, ఇసుక పాలసీ..ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలియజేయనుంది.