80 మంది టీచర్లకు ఉద్యోగోన్నతులు
ABN , First Publish Date - 2020-10-22T10:51:18+05:30 IST
80 మంది టీచర్లకు ఉద్యోగోన్నతులు
ఒంగోలువిద్య, అక్టోబరు 21 : స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్హైస్కూలులో బుధవారం నిర్వహించిన కౌన్సెలింగ్లో 80 మందికి ఉద్యోగోన్నతులు లభించాయని జిల్లా విద్యాశాఖాధికారి వి.ఎ్స.సుబ్బారావు తెలిపారు. గరిష్ఠంగా 58 మంది టీచర్లకు స్కూలు అసిస్టెంటులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. మొత్తం 60 ఖాళీలకు గాను ఒకరికి అవసరమైన అర్హత లేదు. దీంతో 58 తెలుగు స్కూలు అసిస్టెంటు పోస్టులుభర్తీకాగా , 8 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ఎల్ఎ్ఫఎల్ హెచ్ఎంలకు సంబంధించి 70 మంది కౌన్సెలింగ్కు వెళ్లగా 17 మంది మాత్రమే స్థానాలు కోరుకున్నారు. దీంతో 53 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. స్కూలు అసిస్టెంటు హిందీ 4 పోస్టులు, స్కూలు అసిస్టెంటు ఉర్దూ 1 పోస్టు ప్రమోషన్ ద్వారా భర్తీ చేశారు. దీంతో ఉద్యోగోన్నతుల ప్రక్రియ ముగిసినట్లయింది.