గుంటూరులో.. పెరిగిన కేసులు

ABN , First Publish Date - 2020-10-22T10:33:20+05:30 IST

గుంటూరులో.. పెరిగిన కేసులు

గుంటూరులో.. పెరిగిన కేసులు

గుంటూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): గుంటూరు నగరంలో మళ్లీ ఒకే రోజులో వంద కేసులు దాటా యి. ఇటీవల రెండంకెల్లోనే కేసులు వస్తుండటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కాని బుధవారం జిల్లావ్యాప్తంగా 396 కేసులు రాగా గుంటూరు నగరంలో 109 కేసులు రావడంతో ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. బుధవారం ఉదయం వరకు వివిధ ల్యాబ్‌ల నుంచి 6,035 శాంపిల్స్‌ ఫలితాలు అందగా 396(6.56 శాతం) మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇప్పటివరకు వైరస్‌ సోకిన వారి సంఖ్య 65,083 మందికి చేరింది.  కరోనాతో పోరాడి మరో ముగ్గురు చనిపోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 657కి పెరిగింది. ప్రస్తుతం 3,628(5.57 శాతం) మంది చికిత్స పొందుతున్నారు. ప్రతీ 10 లక్షల మంది జనాభా లో 1,32,719 మందికి టెస్టులు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జే యాస్మిన్‌ తెలిపారు. కొత్తగా గుంటూరు నగరంలో 109 మందికి, తెనాలి - 24, నరసరావుపేట - 22, మంగళగిరి - 18, బాపట్ల - 17, వినుకొండ - 17, తాడేపల్లి - 16, మాచర్ల - 16, వట్టిచెరుకూరు - 14, కొల్లూరు - 12, రొంపిచర్లలో 10 మందికి పాజిటివ్‌ వచ్చింది. మిగిలిన మండలాల్లో మరో 121 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-10-22T10:33:20+05:30 IST