సంతకాలు చేయాల్సిందే!

ABN , First Publish Date - 2020-09-21T10:40:42+05:30 IST

సంతకాలు చేయాల్సిందే!

సంతకాలు చేయాల్సిందే!

విజయనగరం రూరల్‌: టీటీడీకి వచ్చే అన్య మతస్థులు విధిగా రిజిస్టర్‌లో సంతకాలు చేయాల్సిందేనని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు తెలిపారు. ఆది వారం  తన నివాసంలో  మాట్లాడుతూ.. టీటీడీ దర్శనానికి వచ్చే అన్యమతస్థులు రిజిస్టర్‌లో సంతకం చేయాలన్న నిబంధన ఈ నాటిది కాదన్నారు. ప్రస్తుతం సంతకం అవ సరం లేకుండానే దర్శనం చేసుకోవచ్చని చెప్పడం ఎంత వరకు సబబన్నారు. తక్షణమే తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని  ఆ పదవి నుంచి తొలగించాలని  డిమాండ్‌ చేశారు.  ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మార్చు కుని, పాత నిబంధనలనే పాటించాలని కోరారు. 

Updated Date - 2020-09-21T10:40:42+05:30 IST