సంక్షేమానికి మరో భూమిక రైతువేదిక
ABN , First Publish Date - 2021-07-06T05:55:43+05:30 IST
సంక్షేమానికి మరో భూమిక రైతువేదిక
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి
వికారాబాద్: సంక్షేమానికి మరో భూమిక రైతు వేదిక అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. వికారాబాద్ మండలం మైలార్దేవరంపల్లి, గొట్టిముక్కుల, సిద్దులూరు గ్రామాల్లో నిర్మించిన రైతువేదిక భవనాలను సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఉపయోగపడుతాయని తెలిపారు. దేశంలో రైతుల కోసం ఇలాంటి నిర్మాణం ఎక్కడా కూడా జరగలేదన్నారు. రైతులు మేలైన వంగడాలు ఎంపిక చేసుకునేలా, అధిక లాభాలు పొందే విధంగా వ్యవసాయాధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం నాల్గవ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి, రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో సర్పంచులు తిరుపతిరెడ్డి, వెంకటేష్, అంజయ్య, ఎంపీపీ చంద్రకళ, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, కమాల్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకటయ్య, గోపాల్, వినోద్కుమార్, ప్రసన్నలక్ష్మి, సుభాషిణి, పావని, ప్రతిభ, కావ్య పాల్గొన్నారు.