ఎంసెట్కి మరో అవకాశం
ABN , First Publish Date - 2020-09-30T17:10:11+05:30 IST
ఈనెల 17 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్ పరీక్ష రాయని విద్యా ర్థులకు ప్రభుత్వం..
కర్నూలు: ఈనెల 17 నుంచి 25 వరకు జరిగిన ఎంసెట్ పరీక్ష రాయని విద్యా ర్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సులకు, 24, 25 తేదీల్లో అగ్రికల్చర్, వెటర్నరీ, ఫార్మసీ కోర్సుల ప్రవే శాలకు ఆన్లైన్ పరీక్ష జరిగింది. కొవిడ్తో ఎంసెట్ పరీక్షకు హాజ రుకాని విద్యార్థులు జ్ఛిజూఞఛ్ఛీటజు2020ః జఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్కు హాల్ టికెట్, కరోనా రిపోర్టులను ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాలని ప్రభుత్వం సూచించింది. వీరికి పరీక్ష నిర్వహించే తేదీని తరువాత ప్రకటిస్తారు. విద్యార్థులకు సందేహాలు ఉంటే 0884-2340535, 0884-2356255 నెంబర్లలో సంప్రదిం చాలని ఏపీ ఎంసెట్ చైర్మన్, జేఎన్టీయుకే వైస్ చాన్స్లర్ ఎం.రామలింగరాజు సూచించారు.