పబ్జీ ఆడుతూ భూమి దద్దరిల్లేలా కేకలు... తరువాత ఊహించని విధంగా...
ABN , First Publish Date - 2021-09-07T11:47:54+05:30 IST
పిల్లలు మొదలుకొని యువత వరకూ అందరూ...
దేవాస్: పిల్లలు మొదలుకొని యువత వరకూ చాలామంది పబ్జీ గేమ్కు బానిసలుగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని దేవాస్కు చెందిన దీపక్ అనే 18 ఏళ్ల యువకుడు పబ్జీ గేమ్కు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఉదంతం దేవాస్లోని శాంతినగర్లో చోటుచేసుకుంది.
11వ తరగతి చదువుతున్న దీపక్... పబ్జీ గేమ్ ఆడుతూ భూమి దద్దరిల్లేలా గట్టిగట్టిగా కేకలు పెట్టాడు. ఆ తరువాత ప్రాణాలు వదిలాడు. వివరాల్లోకి వెళితే... దీపక్ దివ్యాంగుడు. ఇటీవలే 10 వ తరగతి పాసయ్యాడు. పబ్జీ ఆడుతూ దీపక్ గట్టిగా కేకలు పెట్టి, స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే దీపక్ మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీపక్ మృదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ రిపోర్టు వచ్చిన తరువాతనే దీపక్ ఎలా చనిపోయాడనేది తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాగా దీపక్ గత కొంతకాలంగా పబ్జీ గేమ్ ఆడుతున్నాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.