మరో 58 కరోనా కేసులు!
ABN , First Publish Date - 2022-06-30T06:03:52+05:30 IST
జిల్లాలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 358 మందికి పరీక్షలు నిర్వహించగా 58 మంది (16 శాతం పాజిటివిటీ రేటు)కి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది.
విశాఖపట్నం, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బుధవారం 358 మందికి పరీక్షలు నిర్వహించగా 58 మంది (16 శాతం పాజిటివిటీ రేటు)కి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,92,155కు చేరింది. ఇందులో 1,90,665 మంది కోలుకోగా, మరో 257 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్ బారినపడి 1,153 మంది మృతిచెందారు. ఇదిలావుంటే కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమవుతున్నారు. పరీక్షల సంఖ్య పెంచడంతోపాటు కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు.