మరో 1138 మందికి పాజిటివ్
ABN , First Publish Date - 2020-08-12T09:56:46+05:30 IST
మరో 1138 మందికి పాజిటివ్
- 29,452కు చేరిన బాధితులు
- ముగ్గురి మృతి
కర్నూలు(హాస్పిటల్), ఆగస్టు 11: జిల్లాలో మంగళవారం 1138 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 29,452కు చేరింది. వీరిలో 10,258 యాక్టివ్ కేసులు ఉండగా, 18,940 మంది డిశ్చార్జి అయ్యారు. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందగా, కరోనా మరణాల సంఖ్య 254కి చేరింది.