మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2021-10-21T05:01:26+05:30 IST

కొవిడ్‌-19 వాక్సినేషన్‌ 100కోట్లు దాటిన సందర్భంగా కాగజ్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం నిర్వ హించారు.

మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
ప్రధాని చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న కొత్తపల్లి శ్రీనివాస్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 20: కొవిడ్‌-19 వాక్సినేషన్‌ 100కోట్లు దాటిన సందర్భంగా కాగజ్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం నిర్వ హించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిర్పూర్‌నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా విజృంభించిన సమయంలో కేంద్ర ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక వల్లనే వాక్సినేషన్‌ విజయవంతం అయ్యిందన్నారు. వాక్సినేషన్‌ కార్యక్రమానికి విశేష కృషి చేసిన స్థానిక వైద్యులు, సిబ్బందిని బీజేపీ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ అనిత, నాయకులు గోలెం వెంకటేశ్‌, కార్తీక్‌, చేరాల శ్రీనివాస్‌, కృష్ణ స్వామి, మౌనిక, రమేష్‌, మల్లేష్‌, పోచన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:01:26+05:30 IST