సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం

ABN , First Publish Date - 2020-11-25T05:23:04+05:30 IST

రజకులకు లాండ్రి షాఫ్‌, దోబిఘాట్‌కు ఉచి తంగా విద్యుత్‌ సరఫరాను డిసెంబర్‌ నుంచిరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రజక సంఘ నేతలు సంబరాలను జరుపుకున్నారు.

సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం
సీయం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేస్తున్న రజక సంఘ నాయకులు

కోరుట్ల, నవంబరు 24: రజకులకు లాండ్రి షాఫ్‌, దోబిఘాట్‌కు ఉచి తంగా విద్యుత్‌ సరఫరాను డిసెంబర్‌ నుంచిరాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ రజక సంఘ నేతలు సంబరాలను జరుపుకున్నారు. మంగళవారం పట్టణంలోని రజక సం ఘ భవనం వద్ద సీయం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి టపాసులను పేల్చారు. సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో మిఠాయిలు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు కట్కూరి లింగయ్య, కూట్కూరి గణేష్‌, చంద్రగిరి శ్రీనివాస్‌, చంద్రగిరి భూమయ్య, బింగిసా రపు మధు, గంగాధర్‌, సత్యనారాయణ పాల్గొన్నారు. 

కోరుట్ల రూరల్‌ : రజకులకు సీఎం కేసీఆర్‌ లాండ్రి దుకాణం, దోబి ఘాట్ల వద్ద విద్యుత్‌ సరఫరా ఉచితంగా అందించాలని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకున్నారు. 

సంఘ భవనాలలో కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి సంబరా లు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల ప్రజాప్రతి నిదులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-25T05:23:04+05:30 IST