కుప్పం అన్నక్యాంటీన్‌ వద్ద అన్నదానం

ABN , First Publish Date - 2022-08-07T05:08:20+05:30 IST

కుప్పంలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న క్యాంటీన్‌లో నిత్యం పేదలకు అన్నదానం జరుగుతోంది.

కుప్పం అన్నక్యాంటీన్‌ వద్ద అన్నదానం
కుప్పంలో అన్నదానం చేస్తున్న సత్యేంద్రశేఖర్‌ దంపతులు

కుప్పం, ఆగస్టు 6: కుప్పంలోని ఎన్టీఆర్‌ కూడలి వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్న క్యాంటీన్‌లో నిత్యం పేదలకు అన్నదానం జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారంనాడు కుప్పం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ సత్యేంద్రశేఖర్‌ దంపతులు తమ కుమార్తె గాయత్రీ వినోద్‌ల పెళ్లిరోజును పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేశారు. సుమారు 500ల మందికి వంటకాలు సిద్ధం చేసి వడ్డించి వారి ఆకలి తీర్చారు.


Updated Date - 2022-08-07T05:08:20+05:30 IST