అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ, యూకేజీ: మంత్రి
ABN , First Publish Date - 2021-12-18T18:03:32+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ వెల్లడించారు. బెళగావిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
బెంగళూరు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభిస్తామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ వెల్లడించారు. బెళగావిలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎల్కేజీ, యూకేజీలను ప్రారంభిస్తామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో భారీగా ఫీజులు చెల్లించేందుకు విముక్తి కల్పించినట్టు అవుతుందన్నారు. ఇదే విషయాన్ని శాసనసభలోనూ మంత్రి ప్రస్తావించారు.