AP: ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-02-14T17:49:54+05:30 IST
ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం ఏడుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సోమవారం ఉదయం ఏడుగురు నూతన న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రమాణస్వీకారం చేసినవారు...
కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ప్రమాణం చేశారు.