అనతికాలంలోనే జాతీయ గుర్తింపు
ABN , First Publish Date - 2021-10-26T03:41:47+05:30 IST
వీఎస్యూలోని ఎన్ఎస్ ఎస్ విభాగం అనతికాలంలోనే రెండు అత్యుత్తమ అవార్డులతో జాతీయస్థాయి గుర్తింపు పొందిందని
- వీఎస్యూ రిజిస్ర్టార్
వెంకటాచలం, అక్టోబరు 25 : వీఎస్యూలోని ఎన్ఎస్ ఎస్ విభాగం అనతికాలంలోనే రెండు అత్యుత్తమ అవార్డులతో జాతీయస్థాయి గుర్తింపు పొందిందని రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్యూలో సోమవారం మహారాష్ట్ర వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే క్యాంపులో పాల్గొన్న వీఎస్యూ ఎన్ఎస్ఎస్ వలంటీర్స్ చెవురు శిరీష (జేబీ డిగ్రీ కళాశాల, కావలి), భీమవరం వెంకీ (కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల, నెల్లూరు)లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో వీఎస్యూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ అల్లం ఉదయ్శంకర్, సిబ్బంది షేక్ ఉస్మాన్ అలీ, జే స్వాతి తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన రెక్టార్
విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం యూనివర్సిటీల వీసీల సమావేశం జరిగింది. ఈసందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డిని వీఎస్యూ రెక్టార్ ఎం చంద్రయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.
----------