Road accident: అనంతపురంలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-07-17T15:43:51+05:30 IST
జిల్లాలోని గుత్తి శివారులోని 44వ జాతీరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
అనంతపురం: జిల్లాలోని గుత్తి శివారులోని 44వ జాతీరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. టమోటా లారీని వెనుక నుండి బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు చిత్రదుర్గం గ్రామానికి చెందిన బులోరా డ్రైవర్ సయ్యద్ సోహిబ్ (27)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.