అనంతలో వైసీపీకి అనుకూలంగా వాలంటీర్ల ప్రచారం
ABN , First Publish Date - 2021-02-27T16:31:13+05:30 IST
జిల్లాలో సోషల్ మీడియా వేదికగా వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారానికి తెరతీశారు.
అనంతపురం: జిల్లాలో సోషల్ మీడియా వేదికగా వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు ప్రచారానికి తెరతీశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఫేస్బుక్, వాట్సప్ ద్వారా అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కదిరిలో 22వ వార్డు కౌన్సిలర్ వైసీపీ అభ్యర్థికి ఓట్లు వేయాలంటూ వాలంటీర్ నాగరాజు పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.