ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యుడిగా ఆనంద్‌

ABN , First Publish Date - 2020-09-25T07:26:16+05:30 IST

సామాజిక అంశాలను మూల కథాంశాలుగా తీసుకుని పలు లఘు చిత్రాలు, మ్యూజిక్‌ వీడియోలు రూపొందించిన

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యుడిగా ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): సామాజిక అంశాలను మూల కథాంశాలుగా తీసుకుని పలు లఘు చిత్రాలు, మ్యూజిక్‌ వీడియోలు రూపొందించిన డైరెక్టర్‌, డాక్టర్‌ ఆనంద్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ మేరకు వచ్చే డిసెం బర్‌లో ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మెంటర్‌, మస్కట్‌ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించనున్నారు. ఆనంద్‌ ఇప్పటివరకు ఇండివుడ్‌, టాటా, ఢిల్లీ, తెలంగాణ, నాటా ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు.  

Updated Date - 2020-09-25T07:26:16+05:30 IST