కాలువలో పడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-05-15T05:51:24+05:30 IST

మండలంలోని చినబొండపల్లి - పెదబొండపల్లి గ్రామాల మధ్యగల జంఝావతి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

కాలువలో పడి వృద్ధుడి మృతి

పార్వతీపురం రూరల్‌: మండలంలోని చినబొండపల్లి - పెదబొండపల్లి గ్రామాల మధ్యగల జంఝావతి కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొమరాడ మండలం గుమడ అగ్రహారం గ్రామానికి చెందిన పిరిడి స్వామినాయుడు (61) జంఝావతి కాలువలో పడి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్వామినాయుడు రాకపోవడంతో శుక్రవారం కొమరాడ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జంఝావతి కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావ డంతో రూరల్‌ ఎస్‌ఐ సింహాచలం హుటాహుటిన కాలువ దగ్గరకు వెళ్లారు. కాలువ లో మృతి చెందిన వ్యక్తి స్వామినాయుడుగా గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

 

Updated Date - 2022-05-15T05:51:24+05:30 IST