నీటికుంటలో పడి వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2022-08-08T05:45:03+05:30 IST

మండలంలోని బి.రాజేరు గ్రామ సచివాలయానికి సమీపంలోగల నీటి కుంటలో పడి గుర్తుతెలియని వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.

నీటికుంటలో పడి వృద్ధుడి మృతి

బొండపల్లి: మండలంలోని బి.రాజేరు గ్రామ సచివాలయానికి సమీపంలోగల నీటి కుంటలో పడి గుర్తుతెలియని వృద్ధుడు ప్రమాదవశాత్తు మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంఽధించిన ఎస్‌ఐ ఎస్‌.రవి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో గత 20 రోజులుగా కళ్లు కనపడని 65 ఏళ్లు వయస్సు ఉండే వృద్ధుడు బిక్షాటన చేస్తూ గ్రామంలో సంచరించేవాడు. ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందిన విషయాన్ని గ్రామస్థుల చూసి, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని విజయనగరం మహరాజా ప్రభుత్వ ఆసుపత్రికి తర లించామని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ఎస్‌ఐ చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 9121109462 ఫోన్‌నెంబరుకు సంప్రదించి వివరాలు తెలియ జేయాలని కోరారు. 

 

Updated Date - 2022-08-08T05:45:03+05:30 IST