క్షణికావేశంలో కొడుకుపై దాడి

ABN , First Publish Date - 2022-08-17T04:54:51+05:30 IST

క్షణికావేశంలో కన్న కొడుకుపైనే ఓ తండ్రి కొడవలితో దాడి చేసి గాయపర్చిన ఘటన సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది.

క్షణికావేశంలో కొడుకుపై దాడి
దాడిలో గాయపడిన రవీందర్‌రెడ్డి

కొడవలితో గాయపర్చిన తండ్రి

సంగారెడ్డి రూరల్‌, ఆగస్టు 16: క్షణికావేశంలో కన్న కొడుకుపైనే ఓ తండ్రి కొడవలితో దాడి చేసి గాయపర్చిన ఘటన సంగారెడ్డి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. సంగారెడ్డి రూరల్‌ సీఐ శివలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఎంఆర్‌ఎఫ్‌ పరిశ్రమలో విశ్రాంత ఉద్యోగి కొత్తరాపు బక్కారెడ్డి  మండలంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా పీఎ్‌సఆర్‌ గార్డెన్‌ సమీపంలోని బాలాజీ అపార్ట్‌మెంట్‌లో ప్లాట్‌ నెంబర్‌ 302లో నివాసముంటున్నారు. ఇటీవల కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లో ఉన్న ప్లాట్‌ను విక్రయించగా వచ్చిన డబ్బులో తన ఖర్చులకు డబ్బు ఇవ్వాలని బక్కారెడ్డి కుమారుడు రవీందర్‌రెడ్డి అడుగగా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయిన తరువాత ఇస్తానని చెప్పాడు. దానికి అంగీకరించని రవీందర్‌రెడ్డి తండ్రితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటలు పెరిగి క్షణికావేశంలో తండ్రి బక్కారెడ్డి కొడుకుపై కొడవలితో దాడి చేశాడు. ఈ దాడిలో రవీందర్‌రెడ్డి కుడిచేయి, ఎడమ కన్నుపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శివలింగం తెలిపారు. 

Updated Date - 2022-08-17T04:54:51+05:30 IST