‘సర్వే చేస్తే... సహించం’

ABN , First Publish Date - 2020-02-20T07:50:28+05:30 IST

తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన భూము లను రాజధానికి ఇచ్చాం. మాకే ఇంత వరకూ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించలేదు. రాజధాని అభివృద్ధి చేయకుండా

‘సర్వే చేస్తే... సహించం’

మంగళగిరి క్రైమ్‌, తాడికొండ, ఫిబ్రవరి 19: తాత, ముత్తాతల నుంచి సంక్రమించిన భూము లను రాజధానికి ఇచ్చాం. మాకే ఇంత వరకూ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించలేదు.  రాజధాని అభివృద్ధి చేయకుండా మా భూములను పేదలకు నివేశన స్థలాలు ఎలా ఇస్తారు. ఇందుకు సంబంధించి సర్వే చేయడానికి వస్తే సహించం. మాకు ప్లాట్లు అప్పగించిన తరువాత మిగులు భూములు ఉంటే పేదలకు ఇవ్వండి. రైతులకు, సీఆర్‌డీఏ అధికారులకు మధ్య ఒప్పందం ఉంది. రెవెన్యూ అధికారులకు రాజధాని భూములపై ఎటువంటి సంబం ధం లేదు.’ అంటూ రాజధాని రైతులు బుధవారం రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పరిధిలోని మంగళ గిరి మండలం కృష్ణాయపాలెం గ్రామంలో 103, 106 సర్వే నెంబర్లలో భూముల సర్వేకు దుగ్గిరాల, పెదకాకాని మండల తహసీల్దార్లు మల్లీశ్వరి, రమేష్‌ నాయుడు, మంగళగిరి, పెదకాకాని సర్వేయర్లు శ్రీని వాసరావు, విజయ్‌కుమార్‌లు వచ్చారు. సర్వే విష యం తెలుసుకున్న కృష్ణాయపాలెం గ్రామ రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకు న్నారు. దీంతో తహసీల్దారు మల్లేశ్వరి కారు దిగలేదు. దీంతో రైతులు ఆమె కారు దిగి తమకు సమాధానం చెప్పాలని పట్టు బట్టినా ఆమె స్పందించలేదు. దీంతో రైతు లు రోడ్డుపై కారుకు అడ్డంగా బైఠాయిం చారు. రాజధాని నిర్మాణం కోసం తాము పంట పొలాలు ఇస్తే... పేదల నివేశన స్థలాల కోసం వాటిని కేటాయించడమే కాకుం డా కనీసం ముందస్తు సమాచారం కూడా లేకుండా రెవెన్యూ అధికారులు సర్వేకు రావడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాజధాని ప్రాంతంలో పంట భూములను సర్వే చేయాలనుకుంటే ముందుగా ఆయా గ్రామాల రైతు లకు సమాచారం అందించిన తరువాతే అడుగు పెట్టా లని, లేకుంటే ఇలాగే అడ్డుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మంగళగిరి మండలం యర్రబా లెం, తాడేపల్లి మండలం పెనుమాక, తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు, జేఏసీ నాయకులు హుటాహుటీన పెద్ద సంఖ్యలో కృష్ణా యపాలెం రైతుల రాస్తారోకో వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తుగ్లక్‌ సీఎం డౌన్‌డౌన్‌... తుగ్లక్‌ పాలన నశించాలి.... ఇదేమిరాజ్యం ఇదేమి రాజ్యం... దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసు లు రంగ ప్రవేశం చేశారు. మంగళగిరి, తుళ్లూరు డీఎస్పీ లు దుర్గాప్రసాద్‌, శ్రీనివాసరెడ్డి, మంగళగిరిపట్టణ, రూరల్‌ సీఐలు శ్రీనివాసులరెడ్డి, శేషగిరిరావు, తుళ్లూరు సీఐ శరత్‌ బాబు, ట్రాఫిక్‌ సీఐ నాగేశ్వరరావులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో మంగళగిరి తహసీల్దారు జీవీ రామ్‌ ప్రసాద్‌ సంఘటనా ప్రాంతానికి చేరుకుని కృష్ణాయ పాలెంలో ప్రభుత్వ పోరంబోకు భూములు, డొంక భూములను సర్వే చేయడానికే రెవె న్యూ అధికారులు వచ్చారని రైతులకు వివరించారు. ఇతర మండలాలకు చెందిన  పేదలకు రాజధాని గ్రామాల్లో ఇళ్ల పట్టాలుగా ఇచ్చేందుకు ముందుగానే రెవె న్యూ అధికారులు ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పలువురు రైతులు రామ్‌ప్రసాద్‌ దృష్టికి తీసుకురాగా అటువంటిదేమీ లేదని తెలిపారు. పలువురు మహిళలు మాట్లాడుతూ 4గంటల సేపు అధికారిని అడ్డగిస్తేనే పోలీ సులు, ఇతర అధికారులు వచ్చి నిరసనలు విరమించండి అని చెప్తున్నారు. మరి 64రోజుల నుంచి మహిళలు, రైతు లు నిరసనలు, లాఠీ దెబ్బలు తింటే ఎందుకు స్పందించ లేదని ప్రశ్నంచారు. గ్రామ సభలు నిర్వహించకుండా సర్వే ఎందుకు చేస్తారన్నారు. రాజధానిలో సర్వేలు పేరుతో అధికారులువస్తే ఊరుకో మని హెచ్చరించారు. ఏవరైన వస్తే మా శవాల మీద వెళ్లాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రైతులు రాస్తారోకో చేశారు. రెవెన్యూ అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పంట పొలాలను సర్వేచేస్తే ఇలాగే  ప్రతిఘటిస్తామని  తేల్చిచెప్పి రాస్తా రోకో విరమించారు. 

Updated Date - 2020-02-20T07:50:28+05:30 IST