ప్రజలకు సేవ చేసేందుకు వెంకయ్య నిత్యం కృషి చేస్తారు: అమిత్ షా
ABN , First Publish Date - 2021-11-14T20:36:31+05:30 IST
ప్రజలకు సేవ చేసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిత్యం కృషి చేస్తారని
నెల్లూరు జిల్లా: ప్రజలకు సేవ చేసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిత్యం కృషి చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అనేక కీలక పదవులకు ఆయన వన్నె తెచ్చారని అమిత్ షా కొనియాడారు. నెల్లూరు జిల్లా, వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దేవాలయానికి వెళితే ఎంత పుణ్యమో సేవాలయానికి వెళ్లినా అంతే పుణ్యం వస్తుందని అన్నారు. రైతులపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.