అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం: జేఎనటీయూ వీసీ

ABN , First Publish Date - 2021-04-13T06:08:42+05:30 IST

దేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన సేవలు చిరస్మరణీయ మని జేఎనటీయూ వైస్‌ చాన్సలర్‌ రంగ జనార్దన పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ సేవలు చిరస్మరణీయం: జేఎనటీయూ వీసీ
సమావేశంలో మాట్లాడుతున్న వీసీ రంగ జనార్దన

అనంతపురం జేఎనటీయూ, ఏప్రిల్‌ 12 :   దేశానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన సేవలు చిరస్మరణీయ మని జేఎనటీయూ వైస్‌ చాన్సలర్‌ రంగ జనార్దన పేర్కొన్నారు. జేఎనటీయూలో సోమవారం అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల సంద ర్భంగా ఇంజనీరింగ్‌ కళాశాలలకు చెందిన ఎనఎస్‌ఎస్‌ విద్యార్థులతో వర్చవల్‌ విధానంలో వెబ్‌ సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసం గించారు. దేశానికి అంబేడ్కర్‌ అందించిన సేవలు, ఆయన ఆశయాలను విద్యార్థులకు వివ రించారు. అనంతరం పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎనఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ వసుంధర, డైరెక్టర్‌ దేవకుమార్‌, కో ఆర్డినేటర్‌ జితేంద్రగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T06:08:42+05:30 IST