గుండెలవిసేలా విలపించిన చంద్రబాబు

ABN , First Publish Date - 2021-11-19T20:01:23+05:30 IST

అమరావతి: మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం చేసిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో గుండెలవిసేలా విలపించారు.

గుండెలవిసేలా విలపించిన చంద్రబాబు

అమరావతి: మళ్లీ సీఎం అయ్యేవరకూ ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టబోనంటూ శపథం చేసిన చంద్రబాబు ఆ తర్వాత విలేకరుల సమావేశంలో గుండెలవిసేలా విలపించారు. రెండు నిమిషాలపాటు మాట్లాడలేకపోయారు. ఏనాడూ ఇంటినుంచి బయటకు రాని భువనేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. భువనేశ్వరి చేసిన త్యాగం గొప్పదన్నారు. ప్రతి సంక్షోభంలోనూ ఆమె తనకు అండగా నిలిచారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారి ఇళ్లల్లోని వారిని కూడా ఇలాగే తిడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవమానిస్తోందని, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలను అవమానించడం పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చంద్రబాబు చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ వ్యక్తిగతంగా అవమానించలేదన్నారు. రాజకీయాల్లో విలువలు ఇంత నీచంగా పడిపోయాయనుకోలేదంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ కంటతడిపెట్టుకున్నారు. 

Updated Date - 2021-11-19T20:01:23+05:30 IST