వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు?: రఘురామరాజు

ABN , First Publish Date - 2021-05-15T18:27:54+05:30 IST

నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు.

వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు?: రఘురామరాజు

అమరావతి: నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణం రాజు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర క్షత్రియ  సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అన్నారు. కక్ష సాధింపులో భాగంగానే రఘురామకృష్ణం రాజుని  అరెస్ట్ చేశారని ఆరోపించారు. బెయిల్ రద్దు చెయ్యమని ఫిటిషన్ వేసినందుకు పగపట్టి కావాలని అక్రమ అరెస్ట్ చూపించారని అన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారెంట్ లేకుండా ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీలో రూల్ ఆఫ్ లా అనేది ఉందా అని నిలదీశారు. ఈ అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి కరోనా నియంత్రణపై పెడితే ప్రజల ప్రాణాలైనా కాపాడచ్చు కదా అని హితవుపలికారు. తమ కేసుల విచారణకు ప్రతి శుక్రవారం కోర్టుకు రమ్మంటున్నారని కక్షతో ప్రతి శుక్రవారం ఒక అక్రమ అరెస్టు చేస్తున్నారా అని విరుచుకుపడ్డారు. తమరు పెట్టే అక్రమ కేసులకు త్వరలోనే న్యాయస్థానాలు మళ్ళీ మొట్టికాయలు వేయడం ఖాయమన్నారు. తక్షణమే రఘురామ కృష్ణం రాజుపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్షత్రియుల ఆగ్రహానికి వైసీపీ ప్రభుత్వం గురి కావాల్సి ఉంటుందని రఘురామరాజు హెచ్చరించారు.

Updated Date - 2021-05-15T18:27:54+05:30 IST