ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి

ABN , First Publish Date - 2022-08-20T05:28:53+05:30 IST

అమరావతిని కాపాడి ఆంధ్రులను ఉన్నత స్థితికి చేర్చాలని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు కోరారు.

ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి
బిల్డ్‌ అమరావతి అంటూ తుళ్ళూరు రైతు శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

976వ రోజుకు చేరిన రైతుల ఆందోళలు 

తుళ్ళూరు, ఆగస్టు 19: అమరావతిని కాపాడి ఆంధ్రులను ఉన్నత స్థితికి చేర్చాలని రాజధానికి 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు కోరారు.బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 976వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవం అమరావతి అని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.పదివేల కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు జరిగితే, వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో పదిపైసల పని కూడా జరగలేదన్నారు. అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి కానీ, విధ్వంసం చేయమని కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధ్వంసకర పాలన జరుగుతోందన్నారు. అమరావతిని కాదని మూడుముక్కల ఆటతో రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత న్యాయస్థానం తీర్పును అమలు చేయాలన్నారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. రాజధాని 29 గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.  


Updated Date - 2022-08-20T05:28:53+05:30 IST