అమలాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ

ABN , First Publish Date - 2022-01-29T04:43:12+05:30 IST

అమలాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేస్తూ ముఖ్యవ ుంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

అమలాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై   సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ

అమలాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై 

సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ

అమలాపురంటౌన్‌, జనవరి 28: అమలాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేస్తూ ముఖ్యవ ుంత్రి జగన్‌ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తొలుత స్థానిక హైస్కూ లు సెంటర్‌లో ముఖ్యమంత్రి జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను 95శాతం అమలుచేశారని ప్రశంసలు కురిపించారు. కోనసీమ ప్రజల చిరకాలవాంఛ తీరందన్నారు. హైస్కూలు సెంటర్‌ నుంచి పట్టణ పురవీధుల్లో సాగిన ర్యాలీలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్ర మణి, రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్‌పర్సన్‌ కుడుపూడి సత్యశైలజ, వైస్‌చైర్మన్‌ తిక్కిరెడ్డి వెంకటేష్‌, ఏఎంసీ చైర్మన్‌ బొక్కా ఆదినారాయణ, నాయకులు బొంతు గోవిందుశెట్టి, చెల్లుబోయిన శ్రీనివాస్‌, మట్టపర్తి నాగేంద్ర, సంసాని బులినాని, యండమూరి గంగ, మంగళంపల్లి అంజి బాబు, రవికుమార్‌, దుర్గాభాయి, గోవిందు  పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-29T04:43:12+05:30 IST