పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , First Publish Date - 2022-05-27T05:26:34+05:30 IST
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
షాబాద్, మే 26: మండల పరిధి హైతాబాద్ జెడ్పీ పాఠశాలలో 1995-96 బ్యాచ్ టెన్త్ విద్యార్థులు గురువారం సమ్మేళనం నిర్వహించి నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనం నాటి స్నేహబంధం ఎప్పటికీ మరిచిపోనిదని సంతోషం వ్యక్తం చేశారు. వ్యాపార, ఉద్యోగాల రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడినవారు ఒకచోటికి చేరడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పూర్వ విద్యార్థులు, వారి కుటుంబీకులు అన్నారు. రోజంతా సందడిగా గడిపారు. కార్యక్రమంలో టీచర్లు మధుసూదన్రెడ్డి, రంగారెడ్డి, పూర్వ విద్యార్థులు శ్రీరాంరాఘవేందర్గుప్తా, మహేందర్గౌడ్, రాంరెడ్డి, కుమార్, శ్రీనివా్సరెడ్డి, పెంటయ్య, అంజనేయులు, పుష్ఫలత, మంజుల పాల్గొన్నారు.