టీడీపీ కంచుకోటగా బాపట్లను తీర్చిదిద్దుతా
ABN , First Publish Date - 2020-09-30T11:17:07+05:30 IST
‘బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఊహంచని స్థానం దక్కింది.
7 అసెంబ్లీలపై పసుపు జెండా ఎగరేద్దాం
బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి
మార్టూరు, సెప్టెంబరు 29 : ‘బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా ఊహంచని స్థానం దక్కింది. పా ర్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పసుపు జండాను ఎగురవేస్తాం. ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దుతా నని, అందుకు గ్రామ, మండల స్థాయి పార్టీ నాయ కులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుదామని’ బాపట్ల పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు, పర్చూరు శా సనసభ్యుడు ఏలూరి సాంబశివరావు అన్నారు.
మం గళవారం మండలంలోని ఇసుకదర్శి ఏలూరి క్యాం పు కార్యాలయంలో ఏలూరిని బాపట్ల అసెంబ్లీ పార్టీ సమన్వయకర్త నరేంద్రవర్మతో పాటు పలువురు, నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఏలూరి ఆధ్వర్యంలో బాపట్లలో టీడీపీ విజయం సాధి స్తుందన్న నమ్మకాన్ని నాయకులు వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఏలూరికి అన్నిర కాలుగా అండ దండలు అందిస్తామన్నారు.
ఏలూరిని కలిసిన వారిలో బాపట్ల మాజీ ఎంపీపీ మానం విజేత, సల గల రాజశేఖర్ బాబులతో పాటు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా తెలుగు మ హిళా అధ్యక్షురాలు రావుల పద్మ తో పాటు పలువురు మహిళా నా యకురాళ్లు ఏలూరి ని కలిసి అభినందించారు.