రోడ్డు మరమ్మతులకు నిధుల కేటాయింపు
ABN , First Publish Date - 2021-07-31T04:43:11+05:30 IST
‘లీకేజీల పర్వం.. రహదారులు ధ్వంసం’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు.
మిషన్భగీరథ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష
మెదక్ మున్సిపాలిటీ, జూలై 30: ‘లీకేజీల పర్వం.. రహదారులు ధ్వంసం’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు మిషన్భగీరథ పైపులైన్ పనుల వల్ల తవ్వేసిన రోడ్లను శుక్రవారం పరిశీలించారు. అనంతరం మిషన్భగీరథ కాంట్రాక్టర్ను కార్యాలయానికి పిలిపించుకొని పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని, తీసిన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలని వారికి ఆదేశించారు.