ఆశ్రమం వీధిలో అన్నీ సమస్యలే..
ABN , First Publish Date - 2021-03-03T04:37:59+05:30 IST
పట్టణంలోని 36వ వార్డు 45 సచివాలయ పరిధిలోని గీతా ఆశ్రమంవీధిలో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.
ప్రొద్దుటూరు అర్బన్, మార్చి 2: పట్టణంలోని 36వ వార్డు 45 సచివాలయ పరిధిలోని గీతా ఆశ్రమంవీధిలో సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మురుగు కాలువల్లో పూడికతీయక పోవ డంతో మురుగు పేరుకునిపోయి దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునేవారు లేరు. కాలువలపై ర్యాంపులు కట్టుకోవ డంతో కాలువను రోజువారి గా కార్మికులు శుభ్రం చేసే పరిస్ధి తిలేదు. ముఖ్యంగా ఈవీధిలో నాలుగు ప్రైవేటు ఆసుపత్రులు నాలుగు కాలేజీలు ఒక కళ్యాణమండపం వుంది. వాటికి పార్కింగ్ వసతిలేక రోడ్డుపైనే వాహనాలు నిలపాల్సివస్తోంది. దీనికి తోడు కొందరు రోడ్డును ఆక్రమించి కార్ పార్కింగ్ షెడ్డును నిర్మించుకున్నారు దీంతో రోడ్డులో వాహనాలు వెళ్లే సమస్యలు అటు ఇటు ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నారు. పద్మశాలీయ కళ్యాణమండపం వద్ద ప్రధాన కాలువ పూడిక తీయక పోవడంతో కాలువలో వ్యర్దాలన్ని నిండిపోగా మరో వైపు ఇప్పటికే కాలువ ఆక్రమణకు గురికా వడంతో కుదించుకుపోయిందని స్దానికులు వాపోతున్నారు. శానిటేషన్ వార్ఢుప్లానింగ్ సెక్రటరీలు కనీసం వార్ధులో పరి స్థితిపై పరిశీలించిన దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తు న్నారు. వార్డులో అక్రమకట్టడాలు యథేచ్ఛగా సాగుతున్న వాటిని అడ్డుకున్న పరిస్ధితులు లేవని పలువురు వాపోతు న్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవా లని ప్రజలు కోరతున్నారు.