అన్ని స్థానాల్లో జనసేన పోటీ : పితాని బాలకృష్ణ
ABN , First Publish Date - 2021-01-26T06:39:29+05:30 IST
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పితాని బాలకృష్ణ అన్నారు.
ముమ్మిడివరం,
జనవరి 25: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జనసేన పోటీ
చేస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పితాని
బాలకృష్ణ అన్నారు. ముమ్మిడివరంలో జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన
పార్టీ క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ
అభ్యర్థుల విజయానికి జనసైనికులంతా పనిచేయాలన్నారు. తొలుత సమావేశం
గిద్దలూరులో జనసైనికుడు బండ్ల వెంగయ్యనాయుడు మృతికి సంతాపం వ్యక్తంచేశారు.
నాయకులు గుద్దటి జమ్మి, దంగేటి మంగారావు, సానబోయిన మల్లికార్జునరావు,
యలమంచిలి బాలరాజు, ఆకాశం చంటిబాబు, సానబోయిన వీరభద్రరావు, గోదాశి
పుండరీష్, జక్కంశెట్టి పండు, నూకల దుర్గ, రాయపురెడ్డి బాబి, సలాది రాజా,
అత్తిలి బాబూరావు, రంబాల రమేష్, రంబాల భాస్కర్, గుత్తుల
మల్లికార్జునరావు, విత్తనాల అర్జున్, దూడల స్వామి పాల్గొన్నారు.