అర్హులందరికీ ‘దళితబంధు’ ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-08-11T06:05:20+05:30 IST
అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం కొమురవెల్లి ఎంపీడవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఎంపీడీవో కార్యాలయం ఎదుట సీపీఎం నాయకుల ధర్నా
చేర్యాల, ఆగస్టు 10: అర్హులైన దళితులందరికీ దళితబంధు పథకాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం కొమురవెల్లి ఎంపీడవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ డబ్బులు ఇచ్చినవారికే దళితబంధు అందిస్తున్నారని, తద్వారా అర్హులకు అన్యాయం జరుగుతుందన్నారు. విచారణ చేపట్టి ఆర్థికంగా వెనకబడిన దళితులకు అందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రవీందర్, సనాది భాస్కర్, దాసరి ప్రశాంత్ పాల్గొన్నారు.