అన్ని బస్సులు సిద్ధం చేయాలి
ABN , First Publish Date - 2021-06-20T05:43:36+05:30 IST
కొవిడ్-19 కర్ఫ్యూ సడలింపు మేరకు సోమవారం ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బస్సులు నడిపేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని బస్సులు సిద్ధం చేయాలని పీటీడీ విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్(అర్బన్) బి.అప్పల నాయుడు అధికారులకు సూచించారు.
ద్వారకాబస్స్టేషన్, జూన్ 19 : కొవిడ్-19 కర్ఫ్యూ సడలింపు మేరకు సోమవారం ఉదయం 6.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు బస్సులు నడిపేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని బస్సులు సిద్ధం చేయాలని పీటీడీ విశాఖ రీజియన్ డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్(అర్బన్) బి.అప్పల నాయుడు అధికారులకు సూచించారు. మద్దిలపాలెం, వాల్తేరు, సింహాచలం డిపోలో ఆయన గ్యారేజీ అధికారుల సిబ్బందితో, ట్రాఫిక్ విభాగం అధికారుల సిబ్బందితో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అన్ని బస్సులను ప్రజా రవాణాకు సిద్ధం చేయాలని వివరించారు. ఈ సమావేశంలో డిపోల గ్యారేజీ, ట్రాఫిక్ విబాగం సిబ్బంది పాల్గొన్నారు.