బొమ్మై క్యాబినెట్ విస్తరణ.. 29 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-08-04T20:33:25+05:30 IST

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 29 మంది..

బొమ్మై క్యాబినెట్ విస్తరణ.. 29 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 29 మంది మంత్రులుగా క్యాబినెట్‌లో చేరారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో బుధవారంనాడు జరిగిన కార్యక్రమంలో మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి కర్ణాటక క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించలేదు.


అనుభవం, కొత్త వారి కాంబినేషన్‌తో మంత్రివర్గ విస్తరణ జరుపుతున్నట్టు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు బసవరాజ్ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 8 మంది లింగాయత్‌లు, ఏడుగురు వొక్కలిగాలు, ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు దళితులు, ఒక ఎస్‌సీ, ఒక రెడ్డి సామాజిక వర్గ నేతలతో పాటు ఒక మహిళకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్టు చెప్పారు. కొత్త మంత్రుల పేర్లు రాజ్‌భవన్ అధికారికంగా విడుదల చేస్తుందని తెలిపారు.

Updated Date - 2021-08-04T20:33:25+05:30 IST