ఎయిర్పోర్టులో ఘనంగా అలియా బేగ్ అకాడమీ వేడుకలు
ABN , First Publish Date - 2022-06-27T04:36:00+05:30 IST
శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డి సూర్య ఏరీనాలో
శంషాబాద్ రూరల్, జూన్ 26 : శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని డి సూర్య ఏరీనాలో జరిగిన అలియాబేగ్ అకాడమీ ఆఫ్ బ్యుటీషియన్ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నారు. సంస్థ అధినేత్రి బెరిల్ బెర్నార్డ్ మాట్లాడుతూ.. అలియాబేగ్ అకాడమీ నేడు అంతర్జాతీయ గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు. కరిష్మా వెడ్డింగ్ మాల్ స్పాన్సర్ చేసిన విపరీత బ్రైడల్షో 2021-2022 బ్యాచ్లతో ప్రదర్శింపబడిందని తెలిపారు. మేకప్ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఐఎంఏ సర్టిఫికెట్ అందజేస్తామని తెలిపారు. ఐఎంఏ పరీక్ష జూన్ 22 నుంచి 25వరకు జరిగిందని తెలిపారు. 2021కిగానూ ఎంయూఏ బ్యాయ్లో సాహిబా మాలిక్, 2022కి మిఽథాలీఠాకూర్ విజేతలుగా నిలిచినట్లు తెలిపారు. మేకప్ కోసం అలియా బేగ్ అకాడమీ విద్యార్థులకు సాయం చేస్తోందని చెప్పారు. ప్రఖ్యాత మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకునే వారు అలియాబేగ్ అకాడమీలో చేరవచ్చని చెప్పారు. అకాడమీలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు మేకప్ కోర్సులు నేర్చుకుంటున్నారని తెలిపారు. భారత్లో టాప్ 10బ్రైడల్ మేకప్ ఆర్టి్స్టలో స్ధిరమైన ర్యాంక్ని పొందామని చెప్పారు. ఇటీవలే 2020లో డీడబ్ల్యూహెచ్ఏ ద్వారా ప్రపంచంలోని టాప్ 40బ్రైడల్ మేకప్ ఆర్టి్స్టలలో ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్, అంతటా 2మిలియన్ల మంది అనుచరులతో స్థానం సంపాదించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.