కొవిడ్ కేసులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-05-13T05:47:59+05:30 IST
కొవిడ్ కేసులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్వో మోక్షేశ్వరుడు పేర్కొన్నారు.
- అడిషనల్ డీఎంహెచ్వో మోక్షేశ్వరుడు
ఆత్మకూరు, మే 12: కొవిడ్ కేసులపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్వో మోక్షేశ్వరుడు పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో ఆత్మకూరు సీహెచ్సీ, కొట్టాలచెరువు, బైర్లూటి పీహెచ్సీల వైద్యాధికారులు, వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు పాజిటివ్ కేసులను వేగవంతంగా గుర్తించాలని సూచించారు. రోగుల పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆసుపత్రులకు, స్వల్ప లక్షణాలు ఉన్నట్లయితే క్వారంటైన్కు తరలించాలని చెప్పారు. అదేవిధంగా పాజిటివ్ కేసులను ప్రైవేట్ కాంటాక్ట్లను కూడా గుర్తించి తక్షణమే పరీక్షలను చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కృష్ణమోహన్, వైద్యాధికారులు మోతిలాల్నాయక్, పవన్కుమార్, గులాబ్షా, గజసింహరాజు, సోనియా, నీలోఫర్భాను, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది ఉన్నారు.