ఆదివాసుల ఆకాడి పేన్‌ స్థల పరిశీలన

ABN , First Publish Date - 2022-07-03T03:40:53+05:30 IST

అనాది నుంచి ఆదివా సులు సాగుచేస్తున్న ఆకాడిపేన్‌, పశువులను పూజిం చే పవిత్రస్థలాన్ని జిల్లా పేసా కోఆర్డినేటర్‌ ఆర్క వసంత్‌రావ్‌ శనివారం పరిశీలించారు.

ఆదివాసుల ఆకాడి పేన్‌ స్థల పరిశీలన
ఆకాడిపేన్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్క వసంత్‌రావ్‌, నాయకులు

సిర్పూర్‌(యూ), జూలై 2: అనాది నుంచి ఆదివా సులు సాగుచేస్తున్న ఆకాడిపేన్‌, పశువులను పూజిం చే పవిత్రస్థలాన్ని జిల్లా పేసా కోఆర్డినేటర్‌ ఆర్క వసంత్‌రావ్‌ శనివారం పరిశీలించారు. ఆకాడిపేన్‌ పవిత్రస్థలాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇటీవల సిర్పూర్‌(యూ) గ్రామస్థులు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్థలం కబ్బాకు పరోక్షంగా సహకరిస్తున్నారని పీవోకు వివరిం చారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని పీవో వరుణ్‌రెడ్డి పేసా కోఆర్డినేటర్‌ వసంత్‌రావును ఆదేశించడంతో ఆయన ఈమేరకు విచారణ జరి పారు. తుదినివేదికను ఉట్నూరుఐటీడీఏ కార్యాల యానికి అందజేస్తామని వసంత్‌రావ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T03:40:53+05:30 IST