ఆళ్లగడ్డకు చేరుకున్న అఖిలప్రియ
ABN , First Publish Date - 2021-01-26T05:53:18+05:30 IST
డీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డకు చేరుకున్నారు.
ఆళ్లగడ్డ, జనవరి 25: టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోమవారం మధ్యాహ్నం ఆళ్లగడ్డకు చేరుకున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత హైదరాబాదు నుంచి ఆళ్లగడ్డకు వస్తున్నారని తెలుసుకుని నియోజవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఆమెకు స్వాగతం పలికారు. ఆమె ముందుగా కందుకూరు రోడ్డులోని భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్కు వెళ్లి తల్లిదండ్రులకు నివాళులర్పించారు. అనంతరం భారీగా వచ్చిన అభిమానులతో ఇంటికి చేరుకున్నారు.