ఆసుపత్రిలో చేరిన Prakash Singh Badal
ABN , First Publish Date - 2022-06-12T20:32:04+05:30 IST
శిరోమణి అకాలీ దళ్ ఛీప్ ప్రకాష్ సింగ్ బాదల్ అస్వస్థతతో మొహలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారంనాడు...
చండీగఢ్: శిరోమణి అకాలీ దళ్ (SAD) ఛీప్ ప్రకాష్ సింగ్ బాదల్ (Prakash Singh Badal) అస్వస్థతతో మొహలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆదివారంనాడు చేరారు. పంజాబ్కు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన 94 ఏళ్ల బాదల్ శనివారం రాత్రి వాంతులు చేసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గాస్ట్రో సంబంధింత సమస్యలతో జూన్ 6న చండీగఢ్లోని పీజీఐఎంఇఆర్ ఆసుపత్రిలో ఆయన చేరగా, ఆ మరుసటి రోజే డిశ్చార్జి చేశారు. ఈ ఏడాది జనవరిలో కోవిడ్ పాజిటివ్ రావడంతో లూథియానాలోని ఆసుపత్రిలో చేరారు. అదే నెల 24న డిశ్చార్జి అయ్యారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఫిబ్రవరిలో కార్డియాక్, పల్మనరీ పరీక్షలు చేయించుకున్నారు. రెండు, మూడు వారాలకు ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు.