ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2022-08-08T06:19:46+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో  ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
పాతబస్టాండ్‌ సమీపంలో వాల్‌ పెయింటింగ్‌ వేస్తున్న విద్యార్థులతో ముచ్చటిస్తున్న వీఎంసీ కమిషనర్‌ స్వప్నక్‌ దినకర్‌

గవర్నర్‌పేట, ఆగస్టు 7: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపు నిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పాత బస్టాండ్‌ ఏరియాలో నిర్వహించిన వాల్‌ పెయింటింగ్‌ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వీఎంసీ ఆధ్వర్యంలో 75 సంవత్సరాల స్వాతం త్య్ర స్ఫూర్తితో మన సంస్కృతి, విజయాల అద్భుతమైన చరిత్రను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని బహుమతులు పొందాలని యువకులను, విద్యార్థులను కోరారు.

Updated Date - 2022-08-08T06:19:46+05:30 IST