ఏఐటీయూసీ కార్యవర్గం ఎంపిక
ABN , First Publish Date - 2022-01-22T03:05:08+05:30 IST
స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐటీయూసీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్టాడుతూ ఏఐటీయూసీ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు.
గూడూరు, జనవరి 21: స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐటీయూసీ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్టాడుతూ ఏఐటీయూసీ బలోపేతానికి ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులుగా నారాయణ, ఎంబేటి చంద్రయ్య, ఉపాధ్యక్షులుగా యాకోబు, విజయ్కుమార్తో పాటు 8 మందిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, కాలేషా, సీవీఆర్కుమార్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.