అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యం

ABN , First Publish Date - 2021-03-08T05:02:27+05:30 IST

అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యమని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల అన్నారు.

అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారమే  ఏఐటీయూసీ లక్ష్యం

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల

రాయచోటిటౌన్‌, మార్చి7: అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ లక్ష్యమని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంజుల అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్జీవో హోంలో రాయచోటి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో పనిచేసే 20 మంది అంగన్వాడీ వర్కర్లు, సీఐటీయూ యూనియన్‌ లీడర్లు భాగ్యమ్మ, విజయమ్మ ఆధ్వర్యంలో సీఐటీయూ నుంచి ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశం జరిగింది.   ఈ కార్యక్రమంలో  ఫస్ట్‌ సెక్టార్‌ లీడర్లు భాగ్యలక్ష్మి, విజయమ్మ, ఏఐటీయూసీ రాయచోటి ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి మస్రూన్‌బీ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) రాయచోటి ప్రాజెక్టు పరిధిలోని కార్యకర్తలు విజయమ్మ, భాగ్యలక్ష్మి, అరుణమ్మ, సురేఖ, సంపూర్ణమ్మ, లక్ష్మీప్రసన్న, సుబ్బ మ్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-08T05:02:27+05:30 IST